Saturday, December 6, 2025
Google search engine
Homeలేటెస్ట్ న్యూస్మహిళలకు భారీ శుభవార్త.. వారి అకౌంట్లో రూ.30వేలు జమ..!!

మహిళలకు భారీ శుభవార్త.. వారి అకౌంట్లో రూ.30వేలు జమ..!!

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం వివిధ పథకాలను అమలు చేస్తోంది. డ్వాక్రా మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు అందించి, స్కూటీలు, బైక్‌లు, ఆటోలను సబ్సిడీతో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. స్కూటీ, బైక్‌లకు రూ.12,000, ఆటోలకు రూ.30,000 సబ్సిడీ అందిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలకు మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి, ర్యాపిడో సంస్థతో ఒప్పందం ద్వారా రైడ్‌లు అందిస్తున్నారు. ఇప్పటికే 1,000 ఎలక్ట్రిక్ స్కూటీలు అందించగా, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి వంటి ఎనిమిది నగరాల్లో రోజుకు 500-550 రైడ్‌లు బుక్ అవుతున్నాయి. దీని ద్వారా బైక్‌తో నెలకు రూ.15,000-18,000, ఆటోతో రూ.25,000-30,000 ఆదాయం వస్తోంది.

అదనంగా, డ్వాక్రా మహిళలకు డ్రోన్‌లు అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది, ఈ ఏడాది 440 మందికి డ్రోన్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. రైతుల సాగుకు డ్రోన్‌లు ఉపయోగపడనున్నాయి. ఇటీవల రూ.50,000 విలువైన ఎగ్ కార్ట్‌లను కూడా అందజేశారు. వారి పిల్లల విద్యకు తోడ్పాటుగా 4% వడ్డీతో (35 పైసలు) రుణాలు అందిస్తున్నారు. ఈ చర్యల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది.

RELATED ARTICLES

Most Popular