Employees : దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. కూటమి ప్రభుత్వం సోమవారం ఒక డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాల ప్రకారం, ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచారు, ఇది 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. అదే సమయంలో పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు 3.64 శాతం డీఆర్ పెంచుతూ, దానిని కూడా 2024 జనవరి 1 నుంచి అమలు చేయనుంది.రెండు రోజుల క్రితం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసింది. కొత్త డీఏతో పాటు బకాయిలు కూడా త్వరలో చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు మరియు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Employees : ఏపీ ఉద్యోగులకు భారీ శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
RELATED ARTICLES

